AP Govt Decision On Chukkala Bhumulu Soon: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే చుక్కల భూములపై ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. భూములపై రైతులకు హక్కులు కల్పించే సీఎం చంద్రబాబు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రేషన్శాఖల్ని ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకొస్తామంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.