Aqua Farmer Murdered By Migrant Workers In Konaseema District: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్లలో దారుణం జరిగింది. ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజును కూలీలు హత్య చేయడం కలకలం రేపింది. ఆయన దగ్గర పనిచేసే కూలీలు హత్య చేసి, మృతదేహానికి రాళ్లు కట్టి ఆయన రొయ్యల చెరువులో పడేసి పారిపోయారు. నలుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.