రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈనెల 31 వరకే గడువు, లేకపోతే రేషన్ బంద్

7 months ago 20
రాష్ట్రంలో రేషన్‌ కార్డుల్లోని ప్రతి సభ్యుడు డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ తుది గడువును ప్రకటించింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ నమోదు చేయని వారి రేషన్‌ సరఫరాను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉన్నందున.. గడువు పొడిగించాలని రేషన్ కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు.. కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article