బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీతో లింక్ ఉందేమో అంటూ సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. బెంగాల్లో సువేందు అధికారి లాగా.. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీలోకి వస్తాడని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకమైన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వకుండా.. పార్టీలు మారే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.