తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఓ టీవీ డిబెట్లో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్తో పోలుస్తూ జీవో చదవడం రాదంటూ ఏకవచనంతో దూషించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఒక సీఎంను ఇలా కించపరచడం తప్పని కొందరు అంటుండగా.. గతంలో జగన్పై జరిగిన విమర్శలను, కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు గుర్తుచేస్తున్నారు.