రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే

1 year ago 39
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లనున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడం కోసం సీఎం రేవంత్ విజయవాడ వెళ్తున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి కానూరులోని కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి వివాహ వేడుక వద్దకు వెళ్లి.. వధూవరులను ఆశీర్వదించి, మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాహానికి హాజరు కానున్నారు.
Read Entire Article