ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ఓవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు వడగాలుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రేపు రాష్ట్రంలోని 119 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అలాగే ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.