తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కైత్లాపూర్లో 62 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆయన.. రెండో విడతలో మిగిలిన అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేటాయింపుల్లో వికలాంగులు, జర్నలిస్టులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడానికి మౌలిక వసతులు, తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు.