తెలంగాణలోని కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సిటీ రైళ్ల తయారీ కేంద్రంగా అవతరించనుంది. రూ. 521 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. గంటకు 130 కిమీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లను 300 కిమీ పరిధిలోని నగరాల అనుసంధానానికి వాడనున్నారు. ఐదేళ్లలో 200 రైల్సెట్లను తయారు చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ వందే భారత్ కోచ్ల తయారీకీ వీలుండగా.. ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది.