రూ.5000 కడితే చాలు.. ఎలక్ట్రిక్ సైకిల్ మీ సొంతం.. త్వరపడండి..

4 months ago 24
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వాతావరణ కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వాయు, ధ్వని కాలుష్యాలను నివారించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎలక్ట్రిక్ సైకిళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నెలాఖరులో కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు.. ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీని ప్రారంభిస్తారు. రూ.23,999 విలువ కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఐదు వేలు కడితే అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగతా మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
Read Entire Article