హైదరాబాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక నేపాల్కు చెందిన సాహు గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ, హత్య కుట్ర ఢిల్లీ జైలులో మొదలైందని ప్రధాన నిందితురాలు కల్పన నేతృత్వంలో నేపాల్, ముంబై నేరగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కల్పన కోసం పూణెలో గాలిస్తున్నారు.