ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. అవన్నీ అసత్యాలని కొట్టిపారేసింది. రిజిస్ట్రేషన్ అధికారాలు అన్నీ ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇవి పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తాయని వెల్లడించింది.