పల్నాడు జిల్లాలో ఓ ఉద్యోగిని చేసిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్వీస్ రిజిస్ట్రర్లో పుట్టినతేదీ ఫోర్జరీ చేసిన ఉద్యోగిని.. ఇంక్రిమెంట్ కోసం దరఖాస్తు చేసి దొరికిపోయారు. పుట్టినతేదీ మార్చిన ఉద్యోగిని ఐదేళ్లకుపైగా సర్వీసులో కొనసాగారు. అయితే ఆ ఉద్యోగిని తప్పును గుర్తించిన అధికారులు ఆమెతో నిర్బంధ పదవీ విరమణ చేయించారు. ఇంక్రిమెంట్లు, డీఏల రూపంలో పొందిన నగదు. వేతనం రూపంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నారు.