పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వానికి ముఖ్య సూచన చేశారు. రాష్ట్రంలోని పేద కుటుంబాలకు కనీస ఆదాయాన్ని అందించే.. సార్వత్రిక ప్రాథమిక ఆదాయం పథకాన్ని అమలు చేయాలని సూచించారు. దీని వలన రాష్ట్రంలోని 85 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చు కంటే.. దీనికి అయ్యే వ్యయం తక్కువేనన్నారు విజయసాయిరెడ్డి. అయితే ఇలాంటి పథకాన్నే 2019లో న్యాయ్ పేరుతో రాహుల్ గాంధీ ప్రకటించారు.