తెలంగాణలో రుతుపవనాల నిరాశతో వానాకాలం పంటల సాగు తీవ్రంగా మందగించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. వరి సాగు చేస్తున్న వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పటి వరకు కేవలం 6.40 శాతం మాత్రమే అంటే 4.22 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు కేవలం 41.79 శాతం మేరకే అన్ని రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది.