రామాంతపూర్ ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

9 months ago 16
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటు చేసుకుంది. రామాంతపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించగా.. మృతుల సంఖ్య 6కు చేరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.
Read Entire Article