రాజకీయాల్లోకి రాజారెడ్డి.. తనయుడితో కలిసి ఉల్లి మార్కెట్‌కు షర్మిల

10 months ago 17
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శించారు. కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌ను షర్మిల సందర్శించారు. గిట్టుబాటు ధరపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఉల్లి రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదని షర్మిల విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఉల్లి ధర క్వింటాల్ రూ. 1200 అని చెప్పి మళ్లీ మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం క్వింటా ఉల్లి 2500 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డిని పరిచయం చేసిన వైఎస్ షర్మిల.. అవసరమైన సమయంలో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని అన్నారు.
Read Entire Article