రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నిరుద్యోగ నిరసనల పోరు తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిరుద్యోగుల సమస్యలపై గులాబీ పార్టీ తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి అగ్రనేతలను పోలీసులు తెల్లవారుజామునే గృహనిర్బంధం చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.