యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయం.. దేశంలోనే ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు, విశేషాలివే..
1 year ago
21
యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయం కానుంది. విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కాగా.. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు మెుదలయ్యాయి. ఈనెల 23న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం జరగనుంది. అందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.