బంగారం కొనవద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. బంగారం కొనవద్దని, కార్లలో తిరగొద్దని ప్రధాని చెప్తున్నారన్న పేర్ని నాని.. ప్రజలకు నీతులు చెప్పేందుకు తాను పాటించి చూపాలని అన్నారు. గొప్ప నాయకులు అందరూ ప్రజలకు చెప్పేముందు తాము ఆచరిస్తారని.. అప్పుడే ప్రజలు కూడా దానిని ఫాలో అవుతారన్నారు పేర్ని నాని. ఈ వ్యా్ఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మోదీ సూచనలపై కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పించింది.