మొయినాబాద్లో సంచలనం రేపిన జంట హత్యల కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరు మహిళలను కాకుండా మొత్తం 8 మందిని చంపేందుకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ 8 మంది మహిళల వద్ద భారీగా డబ్బులను అప్పుగా తీసుకున్న నిందితులు.. వారిని అంతమొందిస్తే.. వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు అక్కడికి వెళ్లకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఇప్పుడు వారు పోలీసులను ఆశ్రయించారు.