బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను తెలుగు రాష్ట్రాలను వణికించేందుకు సిద్ధమవుతోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారి, మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.