పాకిస్థాన్ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో మేడ్చల్ పోలీసులు జయీద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పాక్ గ్యాంగ్స్టర్ షెహజాద్ భట్టి అనుచరులతో పరిచయం పెంచుకున్న అతడు.. వారికి ఉత్తరప్రదేశ్ మంత్రుల ఫోన్ నంబర్లు పంపినట్లు గుర్తించారు. దానికి బదులుగా ఆయుధాలు కోరినట్లు విచారణలో తేలింది. బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి దేశ వ్యతిరేక కుట్రలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.