మేడ్చల్: పట్టపగలే నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే యువకుడు దారుణ హత్య

1 year ago 18
పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే.. ఏమాత్రం భయం లేకుండా.. అన్నను సొంత తమ్ముళ్లే అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. పక్కనుంచి బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు అన్నీ వెళ్తున్నా.. ఏమాత్రం భయపడకుండా కత్తులతో పొడిచి రోడ్డు మీద పడేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇంత ఘాతుకానికి పాల్పడిన ఆ ఇద్దరు కొంచెం కూడా జంకకుండా తాపీగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన.. మేడ్చల్‌లో జరిగింది. మేడ్చల్ బస్ డిపో ముందు జాతీయ రహదారిపై.. జనాలంతా చూస్తుండగానే.. కొంచెం కూడా భయపడకుండా.. నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడటం అందరినీ షాకయ్యేలా చేస్తోంది.
Read Entire Article