మేడారం జాతరకు ఆర్టీసీ టికెట్ రేట్లు ఖరారు.. హైదరాబాద్ నుంచి ఎంతంటే..?

6 months ago 24
మేడారం సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వెళ్లే టిక్కెట్ చార్జీలను ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి రూ.600 నుంచి రూ.1,110 వరకు.. వరంగల్ నుంచి రూ.250 నుంచి రూ.500 వరకు చార్జీలు నిర్ణయించింది. అలాగే భూపాలపల్లి, ఖమ్మం, గోదావరిఖని, కొత్తగూడెం వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.
Read Entire Article