నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కీర్తి అనే రెండేళ్ల చిన్నారి బిల్డింగ్ రెండో అంతస్తు పైనుంచి పడి దుర్మరణం చెందింది. రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన మాధవ్ సింగ్, ప్రియాంక దంపతుల కుమార్తె అయిన కీర్తి.. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు భైంసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.