మూసీ బాధితులకు ఊరట.. ఇండ్ల నష్టం తగ్గించేలా పునరుజ్జీవనం ప్రాజెక్టులో కీలక మార్పులు!

5 days ago 6
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టులో ప్రజల ఇండ్లకు నష్టం తగ్గించేలా కీలక వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. గండిపేట్, రాజేంద్రనగర్ పరిధిలోని బాధితుల ఆందోళనల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా మూసీ నది అసలు హద్దులను స్పష్టంగా గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర రెవెన్యూ, ఎంఆర్డీసీఎల్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహిస్తూ హద్దు రాళ్లను పాతే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ హద్దుల నుండి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా ప్రకటించి, అక్కడ పర్యావరణ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
Read Entire Article