రాష్ట్రంలో జనాభా పెంపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడో బిడ్డకు జన్మను ఇచ్చే దంపతులకు రూ.30 వేలు, నాలుగో బిడ్డను కంటే రూ.40 వేలు చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. దీనిపై నెల రోజుల్లోగా ప్రకటన చేస్తామని చంద్రబాబు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జనాభా పెంపు కోసం ప్రోత్సాహకాలు ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది.