ఏపీలో జనాభా పెంపుకోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహకాలు ప్రకటించటంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. 30 వేలు, 40 వేలు ఇవ్వడం సరే కానీ.. వారి పెంపకానికి అయ్యే ఖర్చు, ఎదిగిన తర్వాత ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ.. నిరుద్యోగం పెరుగుతున్న ఈ కాలంలో జీవనోపాధి అవకాశాలు కల్పించాలి కానీ.. ఆకర్షణీయమైన పథకాలు కాదంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు.