Ka Paul On Mudragada Padmanabham Death: ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కూడా ఆయన కుటుంబంలో రాజకీయం నడుస్తోందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ముద్రగడ వంటి సీనియర్ కాపు నేత చనిపోతే నివాళులు అర్పించడానికి, అంత్యక్రియలకు కాపులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ముద్రగడ కోరిక కూడా నెరవేరలేదని.. కాపులంతా ఐక్యం కావాలని పాల్ పిలుపునిచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటవ్వాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.