ముగ్గురు కొడుకులూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. తండ్రిని వదిలేశారు.. ఎంత ఘోరం!

9 months ago 16
కుమారులున్న తల్లిదండ్రులు తెగ మురిసిపోతుంటారు. కానీ, ముగ్గురు కొడుకులున్నా.. ఈ తండ్రిని పట్టించుకోవట్లేదు. ఈ పెద్దాయన పేరు సింగంశెట్టి వెంకటనారాయణ. వయసు 67 ఏళ్లు. నెల్లూరు జిల్లాలోని లింగసముద్రం మండలం పెదపావని గ్రామానికి చెందిన వెంకటనారాయణ.. కావలి ఆర్డీఓ ఆఫీసులో ఒక ఫిర్యాదు చేశారు. తన ముగ్గురు కొడుకులను బాగా చదివించి, ప్రయోజకులను చేసి పెళ్లిల్లు చేస్తే, ముగ్గురూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ బాగా సెటిల్ అయ్యారనీ.. తనను ఎవరూ పట్టించుకోవట్లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఆస్తులన్నీ పంచేసుకొని తనను గాలికి వదిలేశారని, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ పెద్దాయన కన్నీటి కథ వీడియోలో చూడండి..
Read Entire Article