దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని శపథం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. భారీ ఎత్తున ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని మావోయిస్ట్ల శిభిరాలు దాదాపు నేలమట్టమయ్యాయి. మావోలకు పెట్టని కోటల్లా ఉన్న బస్తర్ అడవుల్లోనూ వారి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల నుంచి జరుగుతోన్న వరుస ఎన్కౌంటర్లలో భారీ ఎత్తున మావోలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది లొంగిపోయారు.