మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో దారుణం చోటుచేసుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు బాధ్యత లేకుండా ఉన్నాడనే కోపంతో బ్యాటుతో కొట్టి చంపాడు ఓ తండ్రి. ఆపై భయంతో తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధవీడులో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.