Markapuram Four Killed In Road Accident: మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పెళ్లి బృందం ఆటోను వెనుక నుంచి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్ని అలకనంద, అంకాలు, నాగేశ్, నాగేశ్వరిగా గుర్తించారు. మృతులంతా గిద్దలూరు నల్లబండ బజారుకు చెందిన ఒకే కుటుంబం కావడంతో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తెకు గాయాలయ్యాయి.