మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు తీవ్ర అస్వస్థతకు గురి కావడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.