తన కుమారుడు డిగ్రీ పట్టా అందుకున్న సందర్భంగా మంత్రి అనిత ఎమోషనల్ అయ్యారు. పిల్లలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న అనిత.. ఈ క్షణం తనకెంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. పిల్లలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నప్పుడు తల్లిదండ్రుల అనుభూతిని మాటల్లో చెప్పలేమని.. ఈ రోజు తన హృదయం సంతోషం, కృతజ్ఞతతో నిండిపోయిందంటూ అనిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.