కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య నిరసనలను అణచివేస్తోందని మండిపడుతూ బీఆర్ఎస్ పార్టీ సంచలన పోరాటానికి దిగింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనుల సాధన కోసం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ ఆంక్షలకు లొంగేది లేదని స్పష్టం చేసిన ప్రశాంత్ రెడ్డి.. వేల్పూర్లోని తన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉంటూ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.