మహిళలకు దీపావళి కానుక..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

9 months ago 20
చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘ఇందిరా మహిళాశక్తి చీరల’ పంపిణీని వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఉపాధి లభించింది. అలాగే... 6,780 మంది నేత కార్మికులకు రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. నేతన్న భరోసా కింద కార్మికులకు ఏడాదికి రెండు విడతలుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆయన వివరించారు.
Read Entire Article