మహిళలకు ఉచిత బస్సు ఇవ్వమని ఎవరు అడిగారు.. వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్

7 months ago 21
మహిళలకు రెండు తెలుగు రాష్ట్రాలు అందిస్తున్న ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఉచితాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద సృష్టించే మార్గాలు చూడాలని సూచించారు. అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం తప్ప మిగతావి ఉచితంగా ఇవ్వకూడదని అన్నారు. ఇలాంటి ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని గతంలో కూడా వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Entire Article