మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు.. తగిన శిక్ష వేయాలి.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

7 months ago 11
కీలక మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. మల్లోజుల, ఆశన్నను విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. వారికి ప్రజలే తగిన శిక్ష విధించాలని, తన్ని తరిమేయాలని పలుపునిచ్చింది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని కోరింది.
Read Entire Article