మరోసారి జిల్లాల పర్యటనకు సిద్ధమైన మీనాక్షి నటరాజన్.. నేతలకు కీలక ఆదేశాలు జారీ..

11 months ago 16
ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ తెలంగాణలో జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె నేతలకు ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. సీనియర్, జూనియర్ తేడా లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, పార్టీలో పదవుల పంపిణీలో సిన్సియారిటీని పరిగణిస్తామని ఆమె తెలిపారు.
Read Entire Article