ఐఐటీ భువనేశ్వర్లో ప్రమాదవశాత్తూ బిల్డింగ్ నుంచి కిందపడి తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. గూడురుకు చెందిన నిశాంత్ కుమార్ ఐఐటీ భువనేశ్వర్లో పీహెచ్డీ చేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం హాస్టల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. తోటి విద్యార్థులు గమనించి, ఐఐటీ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.