మరికొన్ని గంటల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

1 month ago 8
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. మరికొన్ని గంటల్లో పలు జిల్లాలలో వర్షం కురవనుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం సాయంత్రం ఈ మేరకు హెచ్చరించింది. మన్యం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక ద్రోణి ప్రభావంతో ఆదివారం రోజున రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Read Entire Article