ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందించాలని.. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మనమిత్ర వాట్సాప్లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు. వాయిస్ మెసేజ్ల రూపంలో వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు.. పలు కీలక సూచనలు చేశారు.