Chidambaram Nara Lokesh Delimitation Debate: దక్షిణాది రాష్ట్రాల డీలిమటేషన్ అంశంపై సరికొత్త డిబేట్ మొదలైంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, మంత్రి నారా లోకేష్ల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. మంత్రి లోకేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ చిదంబరం ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నారు. చిదంబరం ట్వీట్కు మంత్రి నారా లోకేష్ కూాడా కౌంటరిచ్చారు. డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు లోకేష్.