ఉమ్మడి అనంతపురం జిల్లా కూటమి నేతల్లో విభేదాలు వెలుగుచూశాయి. మంత్రి సత్యకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ధర్మవరం టీడీపీ నేత అంజన్ రెడ్డి ఆరోపించటం ఇప్పుడు కలకలం రేపుతోంది. అనంతపురం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన సత్యకుమార్ అనుచరులు తనపై దాడి చేశారని.. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.