భూదాన్ భూముల కేటాయింపుల్లో మనీలాండరింగ్ ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ధరణి పోర్టల్ ద్వారా 42 ఎకరాల నిషేధిత భూములను ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఈ అక్రమ సేల్ డీడ్ల వెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారినట్లు అనుమానిస్తూ.. దీని వెనుక ఉన్న రాజకీయ పెద్దల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.