చికెన్ ధరలు గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడటం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో మార్కెట్కు సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో వారం క్రితం రూ.240 ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ.350 నుంచి రూ.370కి చేరింది. ఎండ వేడికి తోడు కోళ్ల దాణా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు భారమవ్వడంతో వ్యాపారులు ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. సామాన్యులు పెరిగిన ధరలతో చికెన్ కొనాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు.