తెలంగాణలో భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. తాజాగా నీటిమట్టం 50.60 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.