ఆషాఢ బోనాల మహోత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగరం అంతా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర శాఖలు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వరుణుడి కరుణతో తొలి రోజు వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి.